రైతన్నకు పాదాభివందనం.. ఫొటో విడుదల చేసి.. 'దటీజ్ పవన్' అంటున్న జనసేన!

  • పెద్దాయనకు పాదాభివందనం చేసిన పవన్
  • గౌరవించడం పవన్ లక్షణమన్న జనసేన
  • అమరావతిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
జనసేన విడుదల చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులను కలిసిన పవన్ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఓ పెద్దాయన (రైతు)కు పవన్ పాదాభివందనం చేశారు. సభాముఖంగా పవన్ ఆ రైతుకు చేసిన పాదాభివందనం ఫొటోను విడుదల చేసిన జనసేన ‘గౌరవించడం పవన్ లక్షణం’ అని పేర్కొంది. పవన్‌లోని గొప్పతనానికి ఇదో మచ్చుతునక అని తెలిపింది. కాగా, పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం రైతులు లీజుకు ఇచ్చిన స్థలంలో పవన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
JanaSena
Farmer
Amravathi

More Telugu News